Kishan Reddy: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి

Kishan Reddy: అమరులైన వీర జవాన్లకు గుర్తుగా నేషనల్ వార్ మెమోరియల్‌ ఏర్పాటు

Update: 2022-01-19 03:44 GMT

ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి

Kishan Reddy: దేశ రాజధాని ఢిల్లీలో, ఇండియా గేట్ సమీపంలో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రతీ ఒక్కరూ సందర్శించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వార్ మెమోరియల్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి భారత సైన్యంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అమరులైన వీర జవాన్లకు గుర్తుగా నేషనల్ వార్ మెమోరియల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో దాదాపు 23 వేల మంది అమరవీరుల పేర్లు, వివరాలున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News