Kerala CM: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్లపై కేరళ సీఎం అభ్యంతరం
Kerala CM: ఈ తరహా ప్రచారం సరైంది కాదన్న పినరయ్ విజయన్
Kerala CM: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్లపై కేరళ సీఎం అభ్యంతరం
Kerala CM: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పనిచేస్తున్న రేషన్ పంపిణీ వ్యవస్ధను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సరైంది కాదని కేరళ సీఎం విజయన్ కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు ప్రచారం కోసమే మోడీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందనేది సుస్పష్టమని అన్నారు. ఈ తరహా ప్రచారం సరైంది కాదని తన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. ఇలా చేయడం కష్టమని కూడా వివరిస్తామని తెలిపారు.