జార్ఖండ్‌లో మొదలైన క్యాంప్ పాలిటిక్స్‌.. హైదరాబాద్‌కు కాంగ్రెస్‌, జేఎంఎం ఎమ్మెల్యేలు

Hyderabad: శామీర్‌పేట్ లియోనియా హోటల్స్ బుక్ చేసిన టీపీసీసీ

Update: 2024-02-02 09:25 GMT

జార్ఖండ్‌లో మొదలైన క్యాంప్ పాలిటిక్స్‌.. హైదరాబాద్‌కు కాంగ్రెస్‌, జేఎంఎం ఎమ్మెల్యేలు

Hyderabad: జార్ఖండ్‌లో చంపై సోరెన్‌ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరడంతో.. క్యాంప్ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. పది రోజుల్లో బలనిరూపణ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్‌, JMM పార్టీలు. తమ పార్టీలకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ క్యాంప్‌నకు తరలిస్తున్నాయి. రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఎమ్మెల్యేలు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.

హైదరాబాద్‌ చేరుకోనున్న ఎమ్మెల్యేలకు క్యాంప్‌ సిద్ధం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఆపరేషన్‌ బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కు అప్పగించింది అధిష్టానం. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఎమ్మెల్యేలు నేరుగా హోటల్స్‌కు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు బస చేసేందుకు మూడు హోటళ్లను సిద్ధం చేసింది టీపీసీసీ. గచ్చిబౌలి ఎల్లా, రామోజీ ఫిల్మ్‌సిటీతో పాటు శామీర్‌పేట్ లియోనియా హోటల్స్ బుక్ చేసింది.

Tags:    

Similar News