Corona Updates: దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు

Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.

Update: 2021-03-05 07:32 GMT

ఫైల్ ఇమేజ్


Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.తాజాగా 16,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 113 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,73,761 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 1,57,548 మంది మరణించగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,76,319 గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.

తెలంగాణ లో కొత్తగా 188 కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రాత్రి 8గంటల వరకు 40,443 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 166 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మరణించారని ఈ రోజు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో తెలిపంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1639కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న140 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,95,970కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం1,963 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 830 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

Tags:    

Similar News