Ayodhya: అయోధ్య రామమందిరానికి పోటెత్తిన భక్తులు

Ayodhya: 11 రోజుల వ్యవధిలో దర్శించుకున్న 25లక్షల మంది

Update: 2024-02-02 13:32 GMT

Ayodhya: అయోధ్య రామమందిరానికి పోటెత్తిన భక్తులు

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల వ్యవధిలో దాదాపు 25 లక్షలమంది భక్తులు బాలరాముణ్ని దర్శించుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆలయ హుండీకి 11 కోట్ల రూపాయల మేర విరాళాలు అందినట్లు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను ఇటీవలే పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News