కాలువలో పడిన కారు.. నలుగురు విద్యార్థులు అదృశ్యం

ఘజియాబాద్‌లోని మురద్‌నగర్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2020-02-02 10:17 GMT

ఘజియాబాద్‌లోని మురద్‌నగర్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడింది, దాంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ఈ కారు డెహ్రాడూన్ నుండి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం జరిగింది. అందులో డ్రైవర్ సహా ఆరుగురు విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. మురాద్‌నగర్‌లోని డిడౌలి గ్రామానికి కారు చేరుకున్నప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా అకస్మాత్తుగా కారు నీటిలో పడిపోవడంతో ఈ సంఘటన జరిగింది.

అయితే ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా కాలువ నుండి బయటకు రాగా, నలుగురు అదృశ్యమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తప్పిపోయిన విద్యార్థులను వెతకడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని గుర్తించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో తప్పిపోయిన విద్యార్థులను కనుగొనడానికి జాతీయ విపత్తు దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) కు సమాచారం అందించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలికి చేరుకొని విద్యార్థులను వెతుకుతున్నారు. ఇవాళ సాయంత్రానికి కల్లా వారిని గుర్తించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Tags:    

Similar News