Firing in Train: ముంబై- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. ఆర్పీఎఫ్‌ ఏఎస్ఐ సహా ముగ్గురు ప్రయాణికులు మృతి

Firing in Train: B-5 కోచ్‌లో కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్

Update: 2023-07-31 03:32 GMT

Firing in Train: ముంబై- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. ఆర్పీఎఫ్‌ ఏఎస్ఐ సహా ముగ్గురు ప్రయాణికులు మృతి

Firing in Train: రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్‌కుమార్ చౌదరి ఉన్నట్టుండి ఆర్పీఎఫ్ ఏఎస్సై పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం నిందితుడు దహిసర్ స్టేషన్ వద్ద చైన్ లాగి రైలు నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అతడి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. బీ5 కోచ్‌లో ఈ ఘటన జరిగింది.

Tags:    

Similar News