Tamil Nadu: ఏనుగు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురికి గాయాలు
Tamil Nadu: ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల నిరసన
Tamil Nadu: తమిళనాడులో ఏనుగు బీభత్సం సృష్టించింది. కృష్ణగిరి హోసూరు సమీపంలో పొలం వద్దకు వెళ్తున్న రైతులపై ఒంటరి ఏనుగు దాడి చేసి ఇద్దరు మహిళలను చంపేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. ఫారెస్ట్ అధికారి కార్యాలయం దగ్గర గ్రామస్తులు నిరసన చేపట్టారు. కొంతకాలంగా ఏనుగుల దాడిపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా.. చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.