సిద్దూ మూసావాలా కేసులో కీలక పురోగతి.. ముగ్గురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

*నిందితుల నుంచి గ్రేనేడ్లు, తుపాకులు రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Update: 2022-06-20 12:18 GMT

సిద్దూ మూసావాలా కేసులో కీలక పురోగతి.. ముగ్గురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

Sidhu Moose Wala Case: సిద్దూ మూసావాలా కేసులో ఢిల్లీ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీ గ్రనేడ్లు, డినోనేటర్లు, మూడు తుపాకులు, ఓ రైఫిల్‌ను స్వాధీనం చేసవారు. తాజాగా మీడియా ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. మే 29న సింగర్‌ శుభదీప్‌ సింగ్‌ సిద్దూను కొందరు దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కాల్పుల్లో తమ హస్తం ఉందని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. తిహార్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్న లారెన్స్‌ బిష్ణోయ్‌ హత్యకు వ్యూహ రచన చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ మేరకు ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. జూన్‌ 15న బిష్ణోయ్‌ను పోలీసులు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఏడు రోజుల రిమాండ్‌ విధించడంతో పంజాబ్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News