Breaking: నిర్భయ దోషుల అప్పీల్ కొట్టేసిన డిల్లీ హైకోర్ట్.. రేపు ఉరి యధాతథం!
నిర్భయ కేసులో దోషులు ఉరిని తప్పించుకోవడానికి చేసిన చివరి ప్రయత్నాలు నీరుకారిపోయాయి. పటియాల కోర్టు ఈరోజు మధ్యాహ్నం వారి అప్పెల్ ను కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో వారు హైకోర్టు కు వెళ్లారు. డిల్లీ హైకోర్టు అర్థరాత్రికి కొద్ది సమయం ముందు ఈ అప్పెల్ పై వాదనలు వింది. వెంటనే ఈ అప్పీల్ ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. వారికి ముందుగా పరకటించిన ప్రకారం రేపు ఉదయం (మార్చి 20 తెల్లవారుజామున ఉరి తీయనున్నారు.