పెరుగుతున్న కరోనావైరస్ కేసుల ప్రభావంతో, ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్ అనే మరో మూడు దేశాల పౌరులను భారత్ ప్రభుత్వం మంగళవారం నిషేధించింది, వారికి ఇప్పటికే మంజూరు చేసిన రెగ్యులర్ మరియు ఇ-వీసాలను నిలిపివేసింది. భారత ప్రభుత్వం జారీ చేసిన తాజా ప్రయాణ నిషేధాజ్ఞల ప్రకారం, భారతదేశంలోకి ప్రవేశించని ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్ దేశస్థులకు జారీ చేసిన అన్ని వీసాలు మరియు ఇ-వీసాలు తక్షణమే నిలిపివేయబడతాయి.
2020 మార్చి 3 న లేదా అంతకు ముందు జారీ చేసిన జపాన్ మరియు దక్షిణ కొరియా సహా ఇటలీ, ఇరాన్ దేశస్థులకు వీసాలు మరియు ఇ-వీసాలను రద్దు చేశారు. ఫిబ్రవరి 5, 2020 న లేదా అంతకు ముందు వీసా పొందిన వారికి చైనా నుండి వచ్చిన వారికి ఇలాంటి పరిమితులు విధించబడ్డాయి.
దీంతో మొత్తంగా చూసుకుంటే చైనా, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్ దేశాలకు చెందిన విదేశీ పౌరులకు 2020 ఫిబ్రవరి 1 న లేదా అంతకు ముందు మంజూరు చేసిన వీసా మరియు ఇ-వీసాను నిలిపివేసింది.
ఇటాలియన్ మరియు దక్షిణ కొరియా పౌరులకు 2020 మార్చి 5 నాటికి అత్యవసర వీసాలు మంజూరు చేస్తే, ఆయా దేశాల్లో ప్రయోగశాలల నుండి మెడికల్ సర్టిఫికేట్, టెస్ట్డ్ నెగటివ్ ఫర్ కోవిడ్ -19 తీసుకోవాలసి ఉంటుంది.
అలాగే విదేశీ పౌరులు ఇప్పటికే భారతదేశంలో ఉంటే, వారి వీసాలు చెల్లుతాయి. దౌత్య పాస్పోర్ట్లు లేదా OCI కలిగి ఉన్నవారు లేదా UN మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల అధికారులు మరియు పైన పేర్కొన్న దేశాల నుండి ఉన్న వారు రాకపోకలు వారి వైద్య పరీక్షల ఆధారంగా ఉంటాయి.
ఇక విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల కోసం COVID-19 అదనపు ట్రావెల్ అడ్వైజరీ (II) ను మంత్రిత్వ శాఖ జారీ చేసింది. అంతేకాదు.. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలకు వెళ్లడం వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చింది. కాగా కరోనావైరస్ సోకిన కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 110,000 వేలు దాటింది, మరణాలు దాదాపు 4000 కు చేరుకున్నాయి. చైనా, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా కలిపి కరోనావైరస్ కేసులు 100 దేశాలకు పైగా నమోదయ్యాయి, UK, US యూరప్లో ఈ సంఖ్యలు పెరుగుతున్నాయి.