మహారాష్ట్రలో కరోనా పంజా.. కొత్తగా 2553 కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 2,553 పాజిటివ్ కేసులు. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 88,528కి చేరింది. ఇప్పటివరకు 3,169 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,374 గా ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
అయితే రాజధాని ముంబైలో మాత్రం కరోనా కేసులు 50 వేల మార్కు దాటింది. ఒక్క రోజే కొత్తగా 1,311 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,085కి చేరింది. ధారావి ప్రాంతంలో నేడు కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపి ధారావి ప్రాంతంల పాజిటివ్ కేసుల సంఖ్య 1,924కి చేరింది. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కరోనాతో పోరాడి 71 మంది మరణించారు.
భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 9,983 కేసులు నమోదు కాగా,206 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,56,611 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,25,381 ఉండగా, 1,24,094 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 7,135 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,08,048. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 47,74,434.