Coronavirus Updates in India: భారత్‌లో అత్యధికంగా 64,399 పాజిటివ్ కేసులు..

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Update: 2020-08-09 04:27 GMT
Representational Image

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 21,53,011 కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 64,399 కేసులు నమోదు కాగా, 861 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 53,879 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 20,88,612 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,28,747 ఉండగా, 14,80,885 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 43,379 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68.78 శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో అత్యధికంగా 719364 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


Tags:    

Similar News