Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 63,490 కరోనా పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.

Update: 2020-08-16 04:29 GMT
Representational Image

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 25,89,682 కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 63,490 కేసులు నమోదు కాగా, 944 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 25,89,682 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,77,444 ఉండగా, 18,62,258 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 49,980 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71.91 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.93 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 26.88 శాతంగా ఉంది. 

Tags:    

Similar News