Coronavirus Updates in India: దేశంలో తొలిసారి అత్యధికంగా 55,079 పాజిటివ్ కేసులు

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Update: 2020-07-31 04:30 GMT
ప్రతీకాత్మక చిత్రం

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులుపెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 16 లక్షల 38 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కేసులు నమోదు కాగా, 779 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 37,223 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 16,38,871 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,45,318 ఉండగా, 10,57,806 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 35,747 మంది కరోనా వ్యాధితోమరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.54 శాతంగా ఉంది.


Tags:    

Similar News