Coronavirus Updates in India : దేశంలో అత్యధికంగా 54,735 పాజిటివ్ కేసులు

Coronavirus Updates in India : భారత్‌లో‌ కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Update: 2020-08-02 06:54 GMT
ప్రతీకాత్మక చిత్రం

Coronavirus Updates in India : భారత్‌లో‌ కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులుపెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 17 లక్షల 50723 వేలు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 54,735 కేసులు నమోదు కాగా, 853 మంది ప్రాణాలు విడిచారు.

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 51255 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,67,730 ఉండగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1145629కి చేరింది. ఇదిలా ఉండగా 37, 364 మంది కరోనా వ్యాధితోమరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 65.44 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు గత 24 గంటల్లో 2.13గా ఉంది.

Tags:    

Similar News