Coronavirus: చైనాలో 39 కొత్త కరోనా వైరస్ కేసులు.. కానీ అవి చైనాలోనివి కాదట..

మెయిన్ల్యాండ్ చైనాలో గురువారం 39 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది, అయితే ఇవన్నీ ఆ దేశంలో వ్యాపించినవి కాదని తెలిపింది.

Update: 2020-03-20 05:44 GMT
coronavirus cases in Senegal

మెయిన్ల్యాండ్ చైనాలో గురువారం 39 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది, అయితే ఇవన్నీ ఆ దేశంలో వ్యాపించినవి కాదని తెలిపింది. చైనాలో వరుసగా రెండవ రోజు స్థానికంగా నమోదైన కేసులు లేవని తెలిపింది. కొత్తగా నమోదైన అంటువ్యాధులలో 14 గువాంగ్‌డాంగ్‌లో, ఎనిమిది షాంఘైలో, ఆరు బీజింగ్‌లో ఉన్నాయని ఆరోగ్య అధికారం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా రాజధాని, షాంఘై, గువాంగ్‌డాంగ్ వంటి పెద్ద రవాణా కేంద్రాలు, షెన్‌జెన్‌తో సహా, నమోదైన కేసులలో ఎక్కువగా వేరే దేశంలో సోకిన ప్రయాణికులతో సంబంధం ఉన్నవి ఉన్నాయని తెలిపింది.

అయితే గురువారం, ఉత్తరాన ఉన్న టియాంజిన్, లియానింగ్, హీలాంగ్జియాంగ్, షాన్డాంగ్ మరియు గన్సుల, అలాగే జెజియాంగ్, ఫుజియాన్, గ్వాంగ్జీ, సిచువాన్లలో కూడా వేరే దేశాల ద్వారా సంక్రమించిన కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికంగా సంబంధం లేకుండా గురువారం నాటికి చైనాలో మొత్తం దిగుమతి అంటువ్యాధుల సంఖ్య 228 కు చేరుకుంది. దిగుమతి చేసుకున్న ప్రయాణికులు, వీరిలో చాలామంది విదేశాల నుండి తిరిగి వచ్చిన చైనా పౌరులు, వారి స్థితి గురించి ఇప్పటివరకు స్థానిక ప్రజలకు తెలియదు, 14 రోజుల నిర్బంధ కాలానికి మరియు ఇంట్లో లేదా నియమించబడిన వార్డులలో ఒంటరిగా ఉండాలని సూచించినట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఇక సెంట్రల్ హుబీ ప్రావిన్స్ మరియు వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్ రెండవ రోజు కొత్త కేసులు బాగా తగ్గాయని.. అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఇదిలావుంటే ప్రధాన భూభాగమైన చైనాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 80,967 కు చేరుకుంది. వైరస్ వ్యాప్తి ద్వారా మరణించిన వారి సంఖ్య గురువారం సాయంత్రానికి సమయానికి 3,248 కు చేరుకుంది, అంతకుముందు రోజు కంటే కూడా గురువారం మరణాల సంఖ్య తగ్గిందని ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు చైనా ద్వారా సంక్రమణకు గురైన ఇటలీలో మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉందని నివేదికలు దృవీకరిస్తున్నాయి.





Tags:    

Similar News