భారత్ లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

India: పాజిటివ్ కేసులు తగ్గినా పెరుగుతున్న మరణాలు, దేశంలో కొత్తగా 2,34,281 కేసులు, 893 మృతి.

Update: 2022-01-30 06:54 GMT

భారత్ లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

India: భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే పాజిటివ్ కేసులు తగ్గినా.., కోవిడ్ మరణాలు ఆగడం కూడా లేదు. రోజురోజుకు కరోనా బారిన పడి వందల సం‌ఖ్యలో మృతి చెందుతున్నారు. దేశంలో కొత్తగా 2లక్షల 34వేల 281 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో మహమ్మారి కరోనా బారిన పడి 893 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18లక్షల 84వేల 937గా ఉన్నాయి.

Tags:    

Similar News