Congress: నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ.. అభ్యర్థుల జాబితాపై కసరత్తు

Congress: ఇప్పటికే తొలివిడతగా 39 మంది అభ్యర్థుల ప్రకటన

Update: 2024-03-11 04:31 GMT

Congress: నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ.. అభ్యర్థుల జాబితాపై కసరత్తు

Congress: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులపై ఫోకస్ పెట్టాయి. అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది కమిటీ. ఇప్పటికే తొలివిడతగా 39 మంది అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్.. ఇవాళ మరిన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణలో తొలివిడతగా నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్.. మరో 13 స్థానాల్ని పెండింగ్‌లో ఉంచింది. ఇవాళ మిగిలిన అభ్యర్థుల్ని కూడా ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News