ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు కాంగ్రెస్ ఏర్పాట్లు
* రాయపూర్లో మూడు రోజుల పాటు సమావేశాలు
AICC Plenary Session: ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీకి రావాలని పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లకు అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విస్తృత సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాయపూర్లో మూడు రోజుల పాటు జగరనున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలపై చర్చించనున్నారు. ఏఐసీసీ సభ్యుల జాబితా ఖరారు, సమావేశాల అజెండా, తదితర అంశాలపై చర్చ జరగనుంది.