Bihar: కూలిన బ్రిడ్జి.. శిథిలాల క్రింద పడి ఒకరు మృతి
Bihar: 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం
Bihar: బిహార్లోని సుపాల్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. భేజా, బకౌర్ మధ్య ఉన్న మరీచాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... 30 మంది శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో రెస్క్యూ చేపట్టారు.