CM KCR: ఇవాళ రాత్రికి ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

CM KCR: ఈ నెల 4న వసంత విహార్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ

Update: 2023-05-02 10:57 GMT

CM KCR: ఇవాళ రాత్రికి ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

CM KCR: ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 4న ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే వసంత విహార్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.

Tags:    

Similar News