నూకలు మిగిలే ఉన్నాయి.. మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి..

Akshardham Metro Station: మనసు గాయపడిందో.. మనుషుల మీద నమ్మకం పోయిందో.. అసలు బతుకే భారమైందో తెలియదు కానీ...

Update: 2022-04-14 13:10 GMT

నూకలు మిగిలే ఉన్నాయి.. మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి..

Akshardham Metro Station: మనసు గాయపడిందో.. మనుషుల మీద నమ్మకం పోయిందో.. అసలు బతుకే భారమైందో తెలియదు కానీ... ప్రపంచమంతా చూస్తుండగా ఓ పాతికేళ్ల యువతి బలవన్మరణానికి ఒడిగట్టింది. అక్కడున్నవాళ్లంతా వద్దని వారిస్తున్నా, బతుక్కి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆమె వినలేదు. మెట్రో రైల్ స్టేషన్ పైనుంచి దూకేసింది. ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకేసిన ఆ యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి తప్పించేందుకు భద్రతా సిబ్బంది మాటల్లోకి దింపారు. ఆ సమయంలోనే స్టేషన్ కింద సీఆర్పీఎఫ్ జవాన్లు తగిన ఏర్పాట్లు చేసి ఉన్నారు. దీంతో ఆమె దూకగానే కింద పట్టుకున్న నెట్ లో పడి బతికిపోయింది.


Tags:    

Similar News