ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు

బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటకు కేసీఆర్‌ వడవడిగా అడుగులు

Update: 2022-03-03 14:00 GMT

ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు

Delhi: ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతాయి. కానీ అనుహ్యంగా ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలిశారు. ఇటు సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటకు కేసీఆర్‌ వడవడిగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి- కేసీఆర్ మద్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీ సుబ్రమణ్య స్వామితో పాటు బీకేయూ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ సహా పలువురు పలువురు జాతీయ నేతలు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23 లో ఉన్న కేసీఆర్ నివాసంలో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయ అంశాలు, బీజేపీ విధానాలు, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వ పరిహారం అంశాలపై చర్చించారు. 

Tags:    

Similar News