Bengal: మమతాబెనర్జీ మంత్రివర్గ ప్రమాణస్వీకారం

Bengal: మమత కేబినెట్‌లో 43 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

Update: 2021-05-10 07:09 GMT

మమతా బెనర్జీ మంత్రి వర్గం

Bengal: పశ్చిమబెంగాల్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ.. తన కేబినెట్‌ను విస్తరించుకున్నారు. మొత్తం 43 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగ్దీప్ ఢంకార్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రికెటర్ మనోజ్ తివారీకి మంత్రివర్గంలో చోటు దక్కింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా అతిథులను ఆహ్వానించారు.

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగా కీలకమైన హోంశాఖ బాధ్యతలను సీఎం మమతా బెనర్జీయే ఉంచుకున్నారు. ఇక బెంగాల్ కేబినెట్‌లో 44 బెర్తులు ఉన్నాయి. తాజాగా 43 మందిని మంత్రులుగా తీసుకోవడంతో మమతతో కలిసి 44 మంది అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ నేత బిమన్ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా ఈ పదవికి ఎంపిక కావడం ఇది మూడోసారి.

Tags:    

Similar News