Bengal: బెంగాల్‌ అసెంబ్లీ తొలిరోజే గందరగోళం

Bengal: గవర్నర్ ప్రసంగం అడ్డుకున్న బీజేపీ సభ్యులు * ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్ ధన్‌కర్‌

Update: 2021-07-03 05:25 GMT

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గవర్నర్

Bengal: బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశం గందరగోళంగా మారింది. అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న దాడులను ప్రస్తావిస్తూ..ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో దాదాపు 5 నిమిషాలపాటు ప్రసంగాన్ని నిలిపేసిన గవర్నర్‌.. అయినా సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Full View


Tags:    

Similar News