KC Venugopal: మోదీ రెండు స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు..?

KC Venugopal: రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Update: 2024-05-04 12:36 GMT

KC Venugopal: మోదీ రెండు స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు..?

KC Venugopal: రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు కేసీ వేణుగోపాల్ ముందు ప్రస్తావించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి 3 స్థానాల్లో, మోడీ 2 స్థానాల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడం పార్టీ నిర్ణయమని.. క్రమశిక్షణ గల సైనికుడిలా రాహుల్ గాంధీ పార్టీ నిర్ణయాన్ని అనుసరిస్తున్నారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

వాజ్‌పేయి మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని మీ మీడియా ప్రశ్నించిందా..? అని కేసీ వేణుగోపాల్‌ మండిపడ్డారు. 2014లో ప్రధాని మోదీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు ప్రశ్నించారా..? అని అడిగారు. రాహుల్‌గాంధీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించగానే మీ మీడియా అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Tags:    

Similar News