Parliament Budget Session: లోక్‌సభలో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌

Parliament Budget Session: లోక్‌సభలో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2026-02-03 10:22 GMT

Parliament Budget Session: లోక్‌సభలో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగం సమయంలో.. రాహుల్ గాంధీ డోక్లాం వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకురావడంతో స్పీకర్ అడ్డుకున్నారు.

సభను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. దాంతో విపక్ష నేత రాహుల్‌కు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంపైకి పేపర్లు విసిరారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. సభా నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించగా.. స్పీకర్ ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News