జగన్ పక్కన స్టార్ హీరో... మదురైలో పొలిటికల్ పోస్టర్ల సంచలనం

Update: 2020-02-12 06:34 GMT

తమిళనాడులో ఆసక్తికర పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నటుడు విజయ్, ప్రశాంత్ కిషోర్ లు ఒకే వేదిక మీద ఉన్నట్టు కనిపిస్తోన్న ఈ పోస్టర్ సంచలనంగా మారింది. మదురైలోని విజయ్ అభిమానులు దీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీనికి "మాస్టర్ జోసెఫ్ విజయ్ ..." అని శీర్షిక పెట్టి..'మేము ఆంధ్రాను రక్షించాము. మీరు ప్రమాదంలో ఉన్న తమిళనాడును తప్పక కాపాడాలి. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి' అంటూ అందులో రాసి ఉంది. అయితే ఈ మాట జగన్, పీకే కలిసి... విజయ్‌కు చెప్పినట్లుగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది.

ఈ పోస్టర్లు విజయ్‌పై ఇటీవల జరిగిన ఐటీ దాడులను ఉద్ద్యేశించి పెట్టి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమాన హీరో విజయ్ ను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించాలంటే హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలా చోట్ల విజయ అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల ఈ పోస్టర్లను ఇతర పార్టీల కార్యకర్తలు చించి వేయడం విశేషం. 

Tags:    

Similar News