Amar Nath Yatra 2021: జూన్ 28 నుంచి అమర్ నాథ్ యాత్ర
Amar Nath Yatra 2021: అమర్ నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభం కానున్నట్లు దేవస్థానం బోర్డ్ తెలిపింది.
అమర్ నాథ్ గుహ (ఫొటో ట్విట్టర్)
Amar Nath Yatra 2021: అమర్ నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభం కానున్నట్లు దేవస్థానం బోర్డ్ తెలిపింది. అమర్ నాథ్ యాత్రకు ఏప్రిల్ ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు జ్ముకశ్మిర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్తో పాటు యెస్ బ్యాంకులకు చెందిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని అమర్ నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. రిజిస్ట్రేషన్స్ మాత్రం ఏప్రిల్ 1 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు.