Arvind Kejriwal: పంజాబ్ ఫలితాలపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్వీట్

Arvind Kejriwal: విప్లవం సృష్టించిన పంజాబ్ ప్రజలకు అభినందనలు

Update: 2022-03-10 07:57 GMT

పంజాబ్ ఫలితాలపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్వీట్

Arvind Kejriwal: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. అధికార పార్టీ కాంగ్రెస్ డీలా పడగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తోంది. 90 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌తో కలిసి విజయం గుర్తు చూపిస్తున్న ఫోటో ట్వీట్ చేశారు. మార్పు కోరుకున్న పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. 

Tags:    

Similar News