Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి
Maharashtra: 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యంత్రం
Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి
Maharashtra: మహారాష్ట్ర థానేలో ఘోర ప్రమాదం జరిగింది. థానే జిల్లా షాపూర్లో గిర్డర్ యంత్రం కూలి 16 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. థానే జిల్లా షాపూర్లో ఎక్స్ప్రెస్ హైవే ఫేజ్ 3 పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా గిర్డర్ యంత్రం కూలింది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు 14 మంది మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 100 అడుగుల ఎత్తులో పిల్లర్ల మధ్య నుంచి పడిపోయిన యంత్రం.