Haryana: ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు
Haryana: కారు టైర్ మార్చుతుండగా ఢీకొన్న మరో కారు
Haryana: హర్యానాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెవారీ ప్రాంతంలో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన కొందరు కారులో ఖతుశ్యామ్ ఆలయ దర్శనానికి వెళ్లి ఘజియాబాద్కు తిరుగుప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో కారు పంచర్ అవగా... టైర్ మార్చే క్రమంలో మరో కారు వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు.