ఘోర ప్రమాదం: ఆరుగురి దుర్మరణం

Update: 2020-10-03 02:42 GMT

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి బెలగావి జిల్లాలోని సవదట్టి పట్టణ శివార్లలోని సవదట్టి-ధార్వాడ్ రహదారిపై బొలెరో మరియు టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారిని ఇంకా గుర్తించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతులు సవదట్టిలోని చుంచ్నూర్ గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.

23 మంది కూలీలు ధార్వాడ జిల్లా మోరబ గ్రామంలో కూలీ పనులకు వెళ్లారు. శుక్రవారం రాత్రి పనులు ముగించుకొని టాటా ఏస్‌లో వస్తుండగా బెళగావి జిల్లా, సవదత్తి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ధార్వాడ రోడ్డులో బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు టాటా ఏస్‌ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఐదుగురు మహిళలు, చిన్నారి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న సవాదట్టి పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News