భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 3,47,254 మందికి వైరస్

*ప్రస్తుతం 20,18,825 కరోనా యాక్టివ్‌ కేసులు *కరోనా రికవరీ రేటు 93.50శాతం

Update: 2022-01-21 05:00 GMT

భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 3,47,254 మందికి వైరస్

Corona Cases in India: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 3.47 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 9 శాతం అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కరోనాతో పోరాడుతూ 703 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 16.41 శాతం నుంచి 17.94 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20.18 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2.51 లక్షల మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 93.50 శాతంతా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరింది. నిన్నటితో పోల్చితే 4.36 శాతం ఒమిక్రాన్‌ కేసులు పెరిగాయి.

Tags:    

Similar News