Bandipora: బందిపొరా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Bandipora: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2021-07-24 11:03 GMT

Bandipora: బందిపొరా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Bandipora: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బందిపొరాలోని శోక్‌బాబా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన భారత సైనికులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News