Allu Arjun: యాడ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డ అల్లు అర్జున్

* అల్లు అర్జున్ కి లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్

Update: 2021-11-10 07:17 GMT

యాడ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డ అల్లు అర్జున్(ఫైల్ ఫోటో)

Allu Arjun: సినిమాలతో మాత్రమే కాకుండా యాడ్ లు మరియు బ్రాండ్ ప్రమోషన్ ల తో కూడా అందరి దృష్టిని ఆకర్షించే స్టార్ హీరోలలో అల్లుఅర్జున్ కూడా ఒకరు. ఇప్పటికే పలు బ్రాండ్ యాడ్స్ లో కనిపించిన అల్లు అర్జున్ తాజాగా రాపిడో ని ప్రమోట్ చేస్తూ కనిపించారు.

అయితే ఇప్పుడు అదే అల్లు అర్జున్ ను ఇబ్బందుల పాలయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ అల్లు అర్జున్ మరియు రాపిడో సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. టిఎస్ఆర్టిసి ప్రతిష్టను ఈ యాడ్ కించపరిచేలా ఉందని ఈ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ లీగల్ నోటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"ఆర్టీసీ బస్సులు సాధారణ దోస లాగా ఎక్కువ సమయం తీసుకుంటాయి అని, రాపిడో చాలా వేగంగా ఉంటుందని అల్లు అర్జున్ యాడ్ లో చెబుతూ కనిపించారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, ఉద్యోగులు, తదితరులు నుంచి విమర్శలు వస్తున్నాయి.

రాపిడో సర్వీసులను ఆర్టీసీ బస్సులతో పోల్చటం ఏ మాత్రం సబబు కాదని వారు ఖండిస్తున్నారు" అని సజ్జనార్ తెలిపారు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి కానీ ఇలా కించపరచడం మంచిది కాదని అందుకే ఆ సంస్థ తో పాటు అల్లు అర్జున్ కూడా లీగల్ నోటీసులు పంపించామని తెలిపారు సజ్జనార్.



Tags:    

Similar News