Shreya Dhanwanthary: మళ్లీ తెలుగు సినిమాల్లో చేయాలని ఉంది

* తెలుగు సినిమా ఆఫర్ వస్తే వెంటనే ఒప్పుకుంటాను అంటున్న స్నేహగీతం బ్యూటీ

Update: 2021-09-04 11:18 GMT

శ్రేయ ధన్వంతరి (ట్విట్టర్ ఫోటో)

Shreya Dhanwanthary: శ్రేయ ధన్వంతరి.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె 2019 లో నాగ చైతన్య హీరోగా నటించిన "జోష్" సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన "స్నేహగీతం" సినిమాలో కనిపించిన ఈమె కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా మాత్రం శ్రేయ ధన్వంతరి వరుస హిట్ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మ్యాన్" తో బ్లాక్ సూపర్ హిట్ అందుకున్న ఈమె "స్కామ్ 1992" తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలో విడుదల కాబోతున్న ముంబై 26/11 లో కూడా కనిపించబోతున్న ఈమె "స్కామ్ 1992" తో తన కెరియర్ లో కొత్త మార్పు వచ్చిందని చెబుతుంది.

"స్నేహగీతం" సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ శ్రేయ ఆ చిత్ర దర్శకుడు తనకు ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయం అని అప్పుడు ఆమెకు 17 ఏళ్లు మాత్రమే అని చెప్పింది. "నాకు ఇంకా మంచి తెలుగు సినిమాలు చేయాలని ఉంది. ఏదైనా మంచి ఆఫర్ ఇస్తే వెంటనే వెళ్ళిపోతాను. మా అమ్మ కూడా నన్ను తెలుగు సినిమాల్లో చూడాలని అనుకుంటోంది" అని టాలీవుడ్ పై తన ప్రేమను బయట పెట్టింది ఈ తెలుగమ్మాయి. ఆర్.బల్కి దర్శకత్వంలో సన్నీ డియోల్, పూజా భట్ మరియు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఒక సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉంది శ్రేయ.

Tags:    

Similar News