Samantha Ruth Prabhu: తనకు క్షమాపణ చెప్పి తీరాలి అంటున్న సమంత

*మూడు యూట్యూబ్ చానెల్స్ పై కేసు నమోదు చేసిన సమంత

Update: 2021-10-23 11:15 GMT

Samantha Ruth Prabhu: తనకు క్షమాపణ చెప్పి తీరాలి అంటున్న సమంత

Samantha Ruth Prabhu: సమంత మరియు నాగ చైతన్య ఈ మధ్యనే తమ విడాకుల ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో వారి విడాకులకు గల కారణాలు ఇవే అని చాలామంది వీడియోలు చేశారు. ఈ నేపథ్యంలో సమంత పై పుకార్లు కూడా సృష్టించారు దీంతో విసుగు చెందిన సమంత ఈ మధ్యనే సోషల్ మీడియా ద్వారా ఆ పుకార్లలో నిజంలేదని తెలిపిన సంగతి తెలిసిందే.

అయినా సరే తన మీద దుష్ప్రచారం ఆగకపోవడంతో సమంత నిన్న కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించి 3 యూట్యూబ్ ఛానల్స్ పైన కేసు నమోదు చేసింది సమంత. ఆమె తరపున ఒక న్యాయవాది పిటిషన్ పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అయితే సామాన్యులైన సెలబ్రిటీ అయినా సరే కోర్టు ముందు అందరూ ఒకటేనని స్పష్టం చేసిన న్యాయమూర్తి కోర్టు సమయం చివర్లో మాత్రమే పిటిషన్ పై విచారణ జరుగుతుందని తెలిపారు. తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అయిన డాక్టర్ సి ఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ మరియు తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ పైన కేసు వేయడం జరిగింది. ఈ ఛానల్ లో వారు తమ వైవాహిక జీవితం గురించి అసత్య ప్రచారాలు చేశారని దాని వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిందని అందువల్ల వారు బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలని ఆమె పిటిషన్లో తెలిపారు.

Tags:    

Similar News