RRR సినిమాపై రాజమౌళి కీలక నిర్ణయం?
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో చాలా దేశాల్లో లాక్ డౌన్ నడుస్తోంది.
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో చాలా దేశాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. దీని ప్రభావం సినిమా రంగంపై బాగానే పడింది. దీంతో అన్ని సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. మళ్లీ సినిమా షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎవరికి క్లారిటీ రావడం లేదు. ఇతర దేశాల్లో సినిమా షూటింగ్లకు పర్మిషన్ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్( రౌద్రం రణం రధిరం) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్ ఆర్ ఆర్ సినిమ లో పలువురు విదేశీ నటులు కూడా ఉన్న విషయం తెలిసిందే. వారి దేశాలలో లాక్డౌన్ ఎత్తివేయాలి. ఆ తరువాతే విదేశీ ఆర్టిస్ట్లు ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో పాలుపంచుకునే అవకాశం ఉంది.
ఇక షూటింగ్ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో ఆర్ఆర్ఆర్ విడుదలను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయాలని రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒకసారి వాయిదా పడింది. మొదట ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదల చేస్తామని జక్కన్న తెలిపారు. తరువాత షూటింగ్లో జాప్యం కారణంగా 2021 జనవరి 8కి వాయిదా వేశారు.
దీంతో ఇప్పుడు కరోనా వైరస్, లాక్ డౌన్తో ఆర్ఆర్ఆర్ రిలీజ్ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి RRR సినిమాలో కూడా అటు మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగగా ఎదరు చూస్తున్నారు.