Paruchuri Venkateswara Rao: పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంట విషాదం

Update: 2020-08-07 04:38 GMT

paruchuri venkateswara rao: ప్ర‌ముఖ ర‌చ‌యిత, నటుడు ప‌రుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెల‌కొంది. పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయలక్ష్మి. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు. సోద‌రుడు పరుచూరి గోపాల‌కృష్ణ‌తో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు.

Tags:    

Similar News