పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. నిర్మాత ఎఎమ్ రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Update: 2020-02-13 10:17 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. నిర్మాత ఎఎమ్ రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తెలంగాణాలోని స్వతంత్ర సమరయోధుడు రాబిన్ హుడ్ పండగ సాయన్న కథగా ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తోంది. మొత్తం అయిదు భాషలలో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి వీరుపాక్ష అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం..

అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ముందుగా ప్రగ్యా జైస్వాల్ అని అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్స్ పేరుకూడా ప్రముఖంగా వినిపించాయి కూడా కానీ బడ్జెట్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.. సవ్యసాచి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన నిధి అగర్వాల్ మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది.

ఇక పవన్ రీఎంట్రీ మూవీగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీకి రిమేక్ గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమానే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టారు పవన్ 

Tags:    

Similar News