Shyam Singha Roy: నాని సినిమాలో మూడు ప్లస్ పాయింట్లు

* నాని సినిమాకి ప్లస్ పాయింట్లు గా మారనున్న హీరోయిన్లు

Update: 2021-12-16 06:53 GMT

నాని సినిమాకి ప్లస్ పాయింట్లు గా మారనున్న హీరోయిన్లు

Shyam Singha Roy: భారీ అంచనాల మధ్య నాని నటించిన "శ్యామ్ సింగరాయి" సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల అవ్వడానికి ముందు అంటే డిసెంబర్ 17న హీరో అల్లు అర్జున్ నటించిన "పుష్ప" విడుదల కానుంది. తర్వాత వచ్చే వారం జనవరి 7 న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత జనవరి 14న ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే అటు ఇటు స్టార్ హీరోల సినిమాలు ఉండగా నాని తన సినిమాని విడుదలకి సిద్ధం చేస్తున్నారు. దీంతో కొందరు దీనిపై ప్రశ్నలు వేస్తున్నారు. కానీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి, స్టార్ బ్యూటీ సాయి పల్లవి, మరియు మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురికి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి కేవలం నాని కోసం మాత్రమే కాకుండా ఈ హీరోయిన్ల కోసం కూడా అభిమానులు థియేటర్లకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు గా చెప్పుకోవచ్చు. మరి 3 ప్లస్ పాయింట్లు ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News