Sr NTR Jayanthi: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి..మెగాస్టార్

Sr NTR Jayanthi: ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ చేశారు.

Update: 2021-05-28 09:00 GMT

చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Sr NTR Jayanthi: ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ చేశారు. అనుకున్నదానిని అమలు చేసేందుకు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని నాయకుడిగా నిలబడ్డారు. అవినీతికి తావివ్వని, సహించని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుజాతికి మరపురాని, మరువలేని తీపిగురుతుగా నందమూరి తారకరామారావు చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు.

అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆచరణలోకి రావడం లేదు. ఇవాళ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

''ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే.. అది తెలుగువారందరికీ గర్వ కారణం.. ఆయన 100వ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా.. ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే.. అది తెలుగువారికి దక్కే గౌరవం" అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News