'సత్యమేవ జయతే2' : రక్తం కూడా త్రివర్ణంలోనే ఉంటుంది!

Satyameva Jayate 2 : విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. తాజాగా

Update: 2020-09-21 05:53 GMT

Satyameva Jayate 2 New look

Satyameva Jayate 2 : విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. తాజాగా తన కొత్త సినిమా 'సత్యమేవ జయతే2' కు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశాడు.. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇందులో అబ్రహం నాగలి చేతబట్టి.. ఒంటిపై జెండా రంగులు పూసుకుని చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు.'గంగా మాత ప్రవహించే ఈ దేశంలో రక్తం కూడా త్రివర్ణంలోనే ఉంటుంది' అని క్యాప్షన్ జోడించారు.

ఇందులో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది.. 2021 ఈద్ సందర్భంగా మే 12న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ముందుగా 2020 అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.. కానీ కరోనా ప్రభావంతో వాయిదా పడింది.. ఇక ఈ సినిమాని మధు భోజ్వానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయి, అమీరా దస్తూర్ తదితరులు నటిస్తున్నారు. మిలాప్ జావేరి దర్శకత్వం వహించాడు.. కాగా 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే' సినిమాకు ఇది సీక్వెల్ కావడం విశేషం.. ఈ పోస్టర్ సినిమా పైన భారీ అంచనాలని క్రియేట్ చేసింది.



అయితే 2021 ఈద్ సందర్భంగా మే 12న సల్మాన్ ఖాన్ తన అప్ కమింగ్ మూవీ 'కబీ ఈద్ కబీ' అనే సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలనీ భావించారు. కానీ మళ్ళీ విడుదల తేదిని 2021 మే 12కి మార్చారు.. ఈ సినిమాకి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించగా, సాజిద్ నాడియాద్వాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు, అయితే ఒకే తేదిన రెండు భారీ సినిమాలను రిలీజ్ చేస్తారా లేకా ఎవరైనా డ్రాప్ అవుతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News