మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్న మ్యాచో స్టార్

Update: 2019-02-27 09:32 GMT

గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమా లతో సతమతమవుతున్న హీరోల్లో మ్యాచో స్టార్ గోపి చంద్ కూడా ఒకరు. ఈ మధ్యనే 'పంతం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ పరవాలేదు అనిపించాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలి అన్న కసి తో తమిళ దర్శకుడు గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో గోపీచంద్ కు ఒక సీన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో చిన్నపాటి గాయాలయ్యాయిఅని వార్తలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ ఇప్పుడు బాగానే ఉన్నాడు అని తెలుస్తోంది. గాయాలు త్వరగా నయం అయ్యాయని ఇప్పుడు గోపీచంద్ మళ్లీ తన షూటింగ్ ను మరికొద్ది రోజుల్లోనే మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ వార్త విని ఫాన్స్ కూడా సంతోషిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి కనీసం ఈ సినిమాతోనైనా గోపీచంద్ ఒక సరైన హిట్ అందుకుంటాడని లేదా అనేది మాత్రం వేచిచూడాల్సి ఉంది.

Similar News