Venkatesh - Krish: వెంకటేష్ తో సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు అంటున్న క్రిష్

* వెంకటేష్ తో ఆ నవల ఆధారంగా సినిమా ప్లాన్ చేసిన క్రిష్

Update: 2021-10-06 15:30 GMT

వెంకటేష్ తో సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు అంటున్న క్రిష్ (ఫైల్ ఫోటో)

Venkatesh - Krish: హార్ట్ హిట్టింగ్ సినిమాలు తీసే దర్శకులలో క్రిష్ పేరు ముందే ఉంటుంది. తన కథ, నెరేషన్ మరియు సెన్సిటివ్ ఎలిమెంట్స్ ని తెరపై చూపించే విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన క్రిష్ తాజాగా ఇప్పుడు "కొండ పొలం" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ మధ్యనే "కొండ పొలం" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

మంచి అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కాబోతోంది. వెంకటరామిరెడ్డి రాసిన "కొండపొలం" అనే ఒక తెలుగు నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఈ కథలు రాయడం అంటే చాలా ఇష్టమని చెప్పారు క్రిష్. ప్రతి స్క్రిప్ట్ తనకి తన కెరీర్లో ఒక కొత్త చాప్టర్ లాంటిదని దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని సినిమాలు చేయటం ఇష్టమని అన్నారు. అయితే వెంకటేష్ హీరోగా "అతడు అడవిని జయించాడు" అనే ఒక నవల ఆధారంగా ఒక సినిమాని ప్లాన్ చేశారట. కానీ ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు, ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు క్రిష్.

Tags:    

Similar News