KBCలో ఈ ఏడూ కోట్ల ప్రశ్నకి సమాధానం తెలుసా?

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కేబీసీ సీజన్ 12 మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సీజన్ లో మొదటిసారిగా జార్ఖండ్ లోని రాంచీకి చెందిన నాజియా నసీమ్ కోటి రూపాయ‌లు గెలుచుకుంది.

Update: 2020-11-12 09:40 GMT

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కేబీసీ సీజన్ 12 మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సీజన్ లో మొదటిసారిగా జార్ఖండ్ లోని రాంచీకి చెందిన నాజియా నసీమ్ కోటి రూపాయ‌లు గెలుచుకుంది. ఏడూ కోట్ల ప్రశ్నకి ఆమె సమాధానం తెలియకపోవడంతో ఆమె కోటి రూపాయలను తీసుకొని షో నుంచి క్విట్ అయ్యారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న నాజియా నసీమ్ మంగళవారం ఎపిసోడ్ లో 40 వేల రూపయులను గెలుచుకున్నారు. ఇక బుధవారం రోజున 25 లక్షల ప్రశ్న వరకు ఎలాంటి లైఫ్ లైన్ వాడుకోకుండా సమాధానం చెప్పారు. ఇలా కోటిరూపాయల ప్రశ్న వరకు టకటక సమాధానం చెప్పుకుంటే వెళ్ళిన నాజియా ఏడూ కోట్ల ప్రశ్న దగ్గర మాత్రం ఆగిపోయారు.

ఎలాంటి లైఫ్ లైన్ లేకపోవడం, ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోవడంతో ఆమె కోటి రూపాయ‌లు తీసుకొని గేమ్ నుంచి వెళ్ళిపోయారు.. అయితే దీపావ‌ళి గిఫ్ట్‌, చాక్లెట్ హ్యాంప‌ర్, ఆమె కొడుకుకు స్కాల‌ర్ షిప్ కూడా కేబీసీ నిర్వాహ‌కులు ఇవ్వ‌డం మరో విశేషం.

ఇంతకీ ఆ ఏడూ కోట్ల ప్రశ్న ఏంటంటే?

నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వం మొదటి ప్రకటన సింగపూర్‌లో ఎక్కడ చేశారు?

A) Cathay Cinema Hall B) Fort Canning Park C) National University of Singapore D) National Gallery Singapore

జవాబు : A 

Tags:    

Similar News