మహేశ్బాబు ఫ్యాన్స్ కు ఆసీస్ క్రికెటర్ బిగ్ సర్ప్రైజ్
ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానుల కోరిక తీర్చాడు.
ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానుల కోరిక తీర్చాడు. కరోనా వ్యాప్తి లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగుపై ఉన్న అభిమానంతో టాలీవుడ్ హీరోల డైలాగ్స్, పాటలతో టిక్ టాక్ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. వార్నర్ సతీమణి క్యాండిస్తో అందరి హీరోల పాటలకు స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నాడు.
ఇదివరకే బన్నీ నటించిన అలవైకుంఠపురంలో.. సినిమాలోని 'రాములో రాములా'తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో పాటలకు భార్యతో కలిసి స్టెప్పులు వేసాడు. మహేష్ పోకిరి, ప్రభాస్ బాహుబలి మూవీ డైలాగ్స్తో మెప్పించాడు. కాగా.. పలువురు హీరోల అభిమానులు వార్నర్కు స్పెషల్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు పక్కా లోకల్ సాంగ్కు డాన్స్ చేసి ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు. ప్రభుదేవా హిట్సాంగ్ ముక్కాలా ముక్కాబులా పాటకు కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
మహేశ్ బాబు ఫ్యాన్స్ కోరిక మేరకు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్బ్లాక్' పాటకి టిక్-టాక్ చేసి అలరించాడు. డాన్స్ చేయలేదు. మైండ్ బ్లాక్' సాంగ్కు టిక్టాక్ అని చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో నిన్న చిన్న హింట్ ఇచ్చాడు. కాగా ..డేవిడ్వార్నర్ శనివారం మహేష్ పాటతో మనముందుకు వచ్చాడు. వార్నర్ ఆయన సతీమణి కాండీస్తో కలిసి మరోసారి మహేశ్బాబు తాజా బ్లాక్బస్టర్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్బ్లాక్' పాటకు చిందులేశాడు. ఇది షూట్ చేయడానికి 50 సార్లు కష్టపడ్డామని వార్నర్ వెల్లడించాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టుచేసి ఈ విషయాన్ని పంచుకున్నాడు.
టీమిండియా ఓపెనర్ రోహిత్శర్మతో లైవ్చాట్లో పాల్గొన్న వార్నర్ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహం వ్యక్తం చేశాడు. అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన మెగా ఈవెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో జరగడం కష్టమేనని అనుమానం వ్యక్తం చేశాడు. వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.