Sushant Singh Rajput: ఎంఎస్ ధోని హీరో 'సుశాంత్ సింగ్' ఆత్మహత్య!

Update: 2020-06-14 09:38 GMT
Sushant Singh Rajput (File Photo)

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 34 సంవత్సరాలు.. ముంబై బాంద్రాలోని తన ఇంట్లో అతను ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఆయన ప్రతినిధి ముంబై పోలీసులకు ఆదివారం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసుల బృందం కార్టర్ రోడ్‌లోని అతని ఇంటికి చేరుకొని..

అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాగా సుశాంత్ 2014 లో 'కై పో చే' తో తొలిసారిగా అడుగుపెట్టాడు.. ఆ తరువాత పికె, కేదార్‌నాథ్, శుధ్ దేశీ రొమాన్స్ , ఎంఎస్ ధోని, ది అన్‌టోల్డ్ జర్నీ వంటి చిత్రాల్లో నటించారు. అతను చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ డ్రైవ్‌లో కనిపించాడు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం 'దిల్‌ బేచారా'. కాగా ఆరు రోజుల క్రితం సుశాంత్ సింగ్ ద‌గ్గర మేనేజ‌ర్‌గా ప‌ని చేసిన దిశ స‌లియా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆ తరువాత సుశాంత్ సింగ్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 

Tags:    

Similar News